నిజం పత్రిక సత్కారం అందుకున్న: పితాని ప్రసాద్, కొయిలాడ పరశురామ్
విశాఖపట్నం,2022 అక్టోబర్ 3, టుడే న్యూస్ : గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో నిరంతరం పాత్రికేయుల సంక్షేమానికి పాటుపడుతున్న ఆజాద్, నేషనల్ న్యూస్ ఎక్స్ ప్రెస్ పత్రికల సంపాదకులు పితాని ప్రసాద్, కొయిలాడ పరశురామ్ లు విశాఖ నగరంలో నిర్వహించిన నిజం మాస పత్రిక వార్షికోత్సవ వేడుకల్లో అతిధులచే సత్కారం అందుకున్న సందర్భంగా వారికి నా హృదయ పూర్వక శుభాభినందనలు
పితాని ప్రసాద్, కొయిలాడ పరశురామ్ ల సేవలను గుర్తించి సత్కరించిన నిజం పత్రిక సంపాదకుడు రవికాంత్ కు ప్రత్యేక అభినందనలు. పితాని ప్రసాద్, కొయిలాడ పరశురామ్ లు సాటి
పత్రిక యాజమాన్యంచే సత్కారం,అభినందనలు అందుకోవడం 'నిజం'గా
పాత్రికేయులందరికీ గర్వ కారణం.