సీఎంకు కరోనాపై ఎన్ని లేఖలు రాసిన స్పందన లేదు: వెలగపూడి
విశాఖ: కరోనా కట్టడిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కరోనాపై సీఎం జగన్కు ఎన్ని లేఖలు రాసిన స్పందన లేదని, అలాగే ముఖ్యమంత్రి ప్రధానికి రాసిన లేఖలకు కూడా ఇలాంటి పరిస్థితే ఉంటుందన్నారు. కరోనాతో సహజీవనం చేయాలంటున్న సీఎం.. తాను మాత్రం ఇంట్లో ఉంటారని విమర్శించారు. గత ఏడాది ఆరోగ్యశ్రీ బకాయిలు 70శాతం చెల్లించలేదని రామకృష్ణబాబు అన్నారు.