30వ తేది(ఆదివారం) మాంసం అమ్మకాలు నిషేధించడమైనది. --- జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన
విశాఖపట్నం, మే-28 :- మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో మాంసము, చేపలు, రొయ్యలు మొదలైన మాంసాహారపు అమ్మకాలు నిషేధించడమైనదిని జివిఎంసి కమిషనర్ డా. జి.సృజన తెలిపారు. కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం కర్ఫ్యూ మరియు 144 సెక్షన్ విధించి నప్పటికీ ప్రజలు గుంపులు గుంపులుగా దుకాణాల వద్ద చేరుతున్నందున ముఖ్యంగా జివిఎంసి పరిధిలోని అన్ని మాంసము, చేపలు, రొయ్యల తదితర మాంసాహారం అమ్మే దుకాణాల వద్ద ప్రజలు తాకిడి ఎక్కువగా ఉన్నందున నగరంలో ఆదివారం(30.05.2021) మాంసం అమ్మకాలు నిషేదించడమైనదని కావున ప్రజలందరూ సహకరించాలని కమిషనర్ కోరడమైనది.